నాగచైతన్యతో పాటు ప్రాణ స్నేహితురాలిని కూడా దూరం పెట్టిన సమంత…?

ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా మంచి హిట్ అవటంతో తెలుగు,తమిళ్, కన్నడ భాషలలో వరస సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని సౌత్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.

అయితే సమంత ఇలా స్టార్ హీరోయిన్ గా మారటానికి ఆమె అందం నటన ఎంత ఉపయోగపడ్డాయో ఆమె వాయిస్ కూడా అంతే ఉపయోగపడిందని చెప్పవచ్చు. అయితే సినిమాలలో వినిపిస్తున్న సమంత గొంతు ఆమెది కాదు. ఏం మాయ చేసావే సినిమా లో సమంత కి డబ్బింగ్ చెప్పింది చిన్మయి శ్రీపాద అనే డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో సమంత యాక్టింగ్ కి చిన్మయి వాయిస్ సరిగ్గా సూట్ అవ్వడంతో అప్పటినుండి ఆమె నటించిన ప్రతి సినిమాలోని సమంతకి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఇలా ప్రొఫెషనల్ గా కలిసిన వీరిద్దరూ పర్సనల్ గా మంచి స్నేహితులుగా మారారు.

ఇలా ఎంతోకాలంగా సమంత నటించిన అన్ని సినిమాలకి డబ్బింగ్ చిన్మయి ఈ మధ్యకాలంలో సమంతకు డబ్బింగ్ చెప్పడం లేదు దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ఈ విషయం గురించి స్పందించిన చిన్మయి ఈ వార్తలలో నిజం లేదని కొట్టి పారేసింది. కానీ సమంత ప్రవర్తన చుస్తే మాత్రం వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత నటించిన యశోద సినిమాలో సమంత నటించిన పాత్రకు చిన్మయితో డబ్బింగ్ చెప్పించాలని చిత్ర నిర్మాతలు భావించగా కానీ సమంత మాత్రం తామే స్వయంగా డబ్బింగ్ చెప్పాలని పట్టు పట్టినట్లు తెలుస్తోంది. దీంతో నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ప్రాణ స్నేహితురాలు అయిన చిన్మయికి కూడా సమంత దూరమైందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.