ఆ విషయంలో అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా.?

పబ్లిసిటీ విషయంలో అల్లు అర్జున్ తనకు తానే సాటి. ఎంతటి స్టార్‌డమ్ వున్నా సరే, పబ్లిసిటీ చేసుకోవడం తెలియకపోతే, ఆ స్టార్‌డమ్ వృధానే. ఆ విషయంలో అల్లు అర్జున్ టాప్ పొజిషన్‌లో వున్నాడు. సౌత్ హీరోలందరిలోనూ అల్లు అర్జునే ఆ విషయంలో నెంబర్ వన్ అని సర్వే ద్వారా తేలింది. అల్లు అర్జున్ పీఆర్ టీమ్స్ చాలా చాలా యాక్టివ్‌గా వుంటాయని ఆ సర్వే ద్వారా బయట పడింది.

అవును నిజమే, అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, పీ ఆర్ టీమ్స్ కూడా ఆల్వేస్ యాక్టివ్‌గా వుంటాయ్. రామ్ చరణ్, ఎన్టీయార్, ఆఖరికి మహేష్ బాబు కూడా ఆ స్థాయిలో తమని తాము ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు.

ఆ పబ్లిసిటీ ప్రమోషనే అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాతో తనను తాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోట్ చేసుకున్నాడు అల్లు అర్జున్.

ఇప్పుడు అదే ఉత్సాహాన్నీ, అదే క్రేజ్‌నీ ‘పుష్ప 2’ కి అంతకు మించిన రేంజ్‌లో వాడబోతున్నాడట. చూడాలి మరి, రెండో పుష్ప రాజ్‌కి ఎంత మేర కలిసొస్తుందో.!