అల్లు అర్జున్ ఓటీటీ ఎంట్రీ.?

ఓ వెబ్ సిరీస్‌ని ఆహా రూపొందించబోతోంది. దీని కోసం అల్లు అర్జున్ వస్తున్నాడట. అంటే ఏదో ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా కాదట. ఒక గెస్ట్ రోల్‌లా ఈ వెబ్ సిరీస్‌లో అల్లు అర్జున్ నటించబోతున్నాడనీ సమాచారం.

దీని కోసం రెండు మూడు రోజులు షూట్ వుంటుందట.. ఇప్పటి వరకూ ఆహా కోసం పలు యాడ్స్‌లో నటించాడు అల్లు అర్జున్. తద్వారా ఆహా ఛానెల‌్‌ని విశేషంగా ప్రమోట్ చేశాడు. జరుగుతున్న ప్రచారం నిజమైతే, తొలిసారి ఓటీటీ తెరపై అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లన్న మాట.

ఇక, ఓటీటీ విషయానికి వస్తే, స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా పలువురు నటీ నటులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ విక్టరీ వెంకటేష్, రానా తదితరులు ఓటీటీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. సినిమాలకు మించి ఓటీటీలో  ఆదరణ దక్కుతోంది.

మరి, అల్లు అర్జున్ కూడా ఓటీటీలో కనిపిస్తే, ఓటీటీకి ఇంకా ఎక్కువ పాపులారిటీ దక్కే అవకాశాల్లేకపోలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా వున్నాడు.