అల్లు అర్జున్ + అల్లు అరవింద్ :: ఇద్దరూ భయపడ్డారు , ఆఖరినిమిషం లో డ్రాప్ అయ్యారు ?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్ గా భారీ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తున్నారు. అలాగే జిఏ2 బ్యానర్ పై నిర్మించే సినిమాలకి భాగ స్వామిగా.. సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రీ కొడులిద్దరి ఇండస్ట్రీలో తమదైన శైలిలో సక్సస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. ఇక అల్లు అరవింద్ ఈ మధ్య కాలంలోనే సొంత ఓటీటీ ఆహా ని జనాలలోకి బాగానే తీసుకు వచ్చారు. ఇన్నాళ్ళు అమెజాన్ ప్రైం… నెట్ ఫ్లిక్స్ గురించి మాత్రమే తెలిసిన తెలుగు వాళ్ళకి అల్లు అరవింద్ ఆహా ని బాగా దగ్గర చేశాడు.

Allu Aravind's Last Warning To ATT!

ఇప్పటికే ఆహా లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో అక్కినేని సమంత హోస్ట్ గా అల్లు అరవింద్ ఒక టాక్ షో ని మొదలు పెట్టారు. ఈ టాక్ షో కి ప్రముఖ దర్శకురాలు బి,వి నందినీ రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షో లో మెగాస్టార్ చిరంజీవి, నాగ్ అశ్విన్, క్రిష్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ల తో పాటు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా పాల్గొన్నారు. కంప్లీట్ ఎంటర్‌టైనర్ గా సాగుతున్న లేటెస్ట్ ఎపిసోడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.

Allu Arjun in Sam Jam Show | Promo | Samantha Akkineni | AA | An aha  Original | #SamJamWithALLUARJUN - YouTube

కాగా ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. అయితే ప్రముఖంగా అల్లు అర్జున్ సొంత స్టూడియో నిర్మాల మీద బయట పెట్టిన విషయాలు ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో తండ్రీ కొడుకులిద్దరు అల్లు అర్జున్ – అల్లు అరవింద్ కలిసి సొంత సినీ స్టూడియోని నిర్మిస్తున్నారు. అలాగే వైజాగ్ లోనూ సినీ స్టూడియోని నిర్మించేందుకు ఆసక్తి చూపించారు. కాని ప్రస్తుతం అక్కడి పరిస్థితులను దృష్ఠిలో పెట్టుకొని ఏపీ లో స్టూడియో నిర్మాణాన్ని కొంతకాలం ఆపివేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియన్ గా తెరకెక్కుతున్న పుష్ప లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.