శ్రీవారి సన్నిధిలో అక్కినేని నాగార్జున దంపతులు!

హీరో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ… ఏడాది కాలం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో మా ఇద్దరు అబ్బాయిల సినిమాలు విడుదల అవుతున్నాయని, ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారని, కేవలం కష్టం ఒకటే కాదని, శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామి వారి దర్శనార్థం వచ్చామని అక్కినేని ‌నాగార్జున‌ అన్నారు.. అనంతరం అమల మీడియాతో మాట్లాడుతూ.. అఖిల్ నటించిన ఏజెంట్, నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ఘన విజయం సాధించాలని శ్రీనివాసుడిని కోరుకున్నట్లు తెలిపారు..