‘విరూపాక్ష’ తరహాలోనే మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ సినిమాలో అఖిల్‌!

కిక్‌, రేస్‌ గుర్రం లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీసిన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్‌ మూవీ ఏజెంట్‌. ఈ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు టాలీవుడ్‌ హీరో అఖిల్‌. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వచ్చిన ఈ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేసి సరికొత్తగా ట్రాన్స్‌ ఫార్మ్‌ అయ్యారు.

తన కెరీర్‌ కి ఏజెంట్‌ ఒక మంచి బ్రేక్‌ ఇస్తుందని భావించారు. అయితే సినిమా ఫలితం నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత అఖిల్‌ నుంచి కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో ఓ రెండు కథలని లైన్‌ పెట్టారు అఖిల్‌.

ఇందులో విరూపాక్ష ఫేం కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది. విరూపాక్ష తరహాలోనే మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఈ కాంబినేషన్‌ కుదిరినట్లే. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే దీనికిపై అధికారిక ప్రకటన రానుంది.