ప్రేక్షకుల ముందుకు ‘ఏకే 62’తో వస్తున్న అజిత్‌…!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. ‘ఏకే 62’గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో త్రిష ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో త్రిష, అజిత్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ కనిపించిన విజువల్స్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అధికారిక అప్‌డేట్‌ వచ్చింది. నేడు దేశంలో షూటింగ్‌ షురూ అయింది. ఈ చిత్రానికి అజిత్‌ మొత్తం 110 రోజులు కాల్షీట్లు ఇచ్చాడని సమాచారం. కాగా ఈ షెడ్యూల్‌ తర్వాత చెన్నైలో జరుగనున్న షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

షూటింగ్‌ కోసం మేకప్‌ వేసుకుంటున్న స్టిల్‌ ఒకటి ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. అప్‌డేట్‌ అందించింది త్రిష. నాన్‌స్టాప్‌గా తాజా షెడ్యూల్‌ కొనసాగనున్నట్టు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత విలన్‌గా నటిస్తున్నాడు.

భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. సాధారణంగా మగిజ్‌ తిరుమేని సినిమాను ఆలస్యం కాకుండా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేస్తుంటాడని తెలిసిందే.

షెడ్యూల్‌ ప్రకారం ఈ చిత్రాన్ని 2024 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్‌ చేస్తున్నాడట డైరెక్టర్‌. ఈ ఏడాది తునివు సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించాడు అజిత్‌. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది.