ఏజెంట్ బిజినెస్.. ఈ రేంజ్ లోనా?

అఖిల్ అక్కినేని హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ఏజెంట్. ఏప్రిల్ 28వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తుండగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

సినీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ చిత్రబృందం దేశ వ్యాప్తంగా క్రేజీ డీల్‌ను లాక్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఈ చిత్రం యొక్క నైజాం హక్కులను ఎక్కువగా ఆసియాకు చెందిన సునీల్ నారంగ్ ఫ్యాన్సీ ధరకు తీసుకున్నారు. మరోవైపు సీడెడ్ హక్కులను 5.25 కోట్ల థియేట్రికల్ రేటుకు శోభన చేజిక్కించుకున్నారు. అలాగే కర్ణాటక డీల్‌ను స్కంద తీసుకున్నట్లు సమాచారం.

అలాగే ప్రముఖ గాయత్రి దేవి ఫిలిమ్స్ వైజాగ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తానికి ఏజెంట్ థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతే కాదండోయ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ SonyLIV చిత్రం యొక్క పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను 34 కోట్లకు కొనుగోలు చేసిందట. సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతకాలానికి ఈ చిత్రం సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా.. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాగూల్ హెరియన్ థారుమాన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా… నవీన్ నూలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఏప్రిల్ 28వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి సహ నిర్మాతలు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది, ఎంత మేర కలెక్షన్లను సాధిస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.