“భోళా శంకర్” నిర్మాతపై కేసు..ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్ షాక్ 

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ ఊరిస్తూ వచ్చిన పాన్ ఇండియా చిత్రం “ఏజెంట్”. యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయ్యింది. గత ఏడాది వచ్చిన భారీ చిత్రం లైగర్ కన్నా పెద్ద డిజాస్టర్ గా ఇది నిలిచిపోయింది.

కాగా మొదట పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేసినప్పటికీ తెలుగు సహా మలయాళంలో మాత్రమే రిలీజ్ అయ్యింది. ఒక మొదటి రోజుకే సినిమా తేలిపోగా ఈ సినిమాకి వచ్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. దీనితో ఈ చిత్రం అయితే తెలుగులో హక్కులు కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలు చూడగా..

అందులో బాగా దెబ్బ తిన్న డిస్ట్రిబ్యూటర్ సినిమా నిర్మాత ఇప్పుడు “భోళా శంకర్” చిరంజీవితో చేసిన నిర్మాత అనిల్ సుంకర పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. తనకి ఆంధ్ర సహా కర్ణాటక హక్కులు 30 కోట్లకి అమ్మితే సినిమా కేవలం 1.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

అయినా తనకి ఎలాంటి సెటిల్మెంట్ చేయకపోగా ఇప్పుడు తనకి తెలియకుండా భోళా శంకర్ హక్కులు మరో వ్యక్తికి హక్కులు అమ్ముకున్నాడు అని తనకి న్యాయం కావాలని అనీల్ సుంకర పై అయితే కేసు వేసినట్టుగా తెలుస్తుంది. దీనితో మరి భోళా శంకర్ రిలీజ్ పై ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందో ఏమో చూడాలి. ఇక భోళా ని అయితే దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించగా ఈ ఆగష్టు 11న రిలీజ్ కానుండగా తమన్నా, కీర్తి సురేష్ లు నటించారు.