ప్రియమణి, సాయి పల్లవి లకి మళ్ళీ మొదలు ..!

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం. ఈ సినిమా గత సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కాని రానా ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ ఉండటం కొన్ని అనివార్య కారణాలు.. ఆ తర్వాత కరోనా కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాగా టాలీవుడ్ లో దాదాపు ఏడు నెలల తర్వాత షూటింగ్ సందడి మొదలైంది. గత నెలలో కొన్ని సినిమాలు సెట్స్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆర్ ఆర్ ఆర్ తో సహా మరికొన్ని సినిమాలు ప్రారంభం అవుతున్నాయి.

Happy birthday Priyamani: Virata Parvam team unveils special poster

ఈ క్రమంలోనే విరాటపర్వం సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాగా ఇప్పటికే ఈ సినిమాలో రానా లుక్ తో పాటు సాయి పల్లవి, ప్రియమణి లుక్ రివీల్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. 1990 కాలం నాటి నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అయితే సినిమాలో ప్రియమణి, సాయి పల్లవి నక్సలైట్స్ గా నటిస్తున్నారు. కాని రానా పోలీస్ గా కనిపించబోతున్నాడా నక్సలైట్ గా కనిపించబోతున్నాడా అన్నది మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్ ఉంచారు.

Virata Parvam: Intense training for Sai Pallavi | klapboardpost

ఇక ఈ సినిమాని వికారాబాద్ ఫారెస్ట్ లో నవంబర్ మొదటి వారం నుంచి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళి 20 రోజుల టాకీ పార్ట్ కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ తో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని తెలుస్తుంది. కాగా ఈ షెడ్యూల్ లో రానా.. సాయి పల్లవి.. ప్రియమణితో పాటు కీలక నటీనటులు పాల్గొనబోతున్నారు. అన్నీ కార్యక్రమాలు ప్లాన్ ప్రకారం ఫినిష్ అయితే ఈ సినిమాని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా భారీగా అంచనాలు పెట్టుకుంది. అలాగే వెంకటేష్ సరసన నారప్ప సినిమాలోను హీరోయిన్ గా నటిస్తుంది ప్రియమణి.