KGF Movie: కేజిఎఫ్ హిట్ అయిన తర్వాత ముందుగా ఫోన్ చేసి విష్ చేసిన హీరో మహేష్ .. ప్రశాంత్ నీల్ కామెంట్స్ వైరల్!

KGF Movie: ఎలాంటి అంచనాలు లేకుండా 2018వ సంవత్సరంలో కేజిఎఫ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఊహించన స్థాయిలో విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగాకేజిఎఫ్ 2తెరకెక్కించి ఈ సినిమాని ఈనెల 14వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా మొదటి షో తోనే మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ సొంత గ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠ పురం గ్రామం అని వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి స్వయంగా తనకు అన్న వరస అవుతారని ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ తెలియజేశారు.ఇకపోతే ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ ఈ సినిమా విడుదలైన తర్వాత ఏ హీరోలైన మీకు ఫోన్ చేసి ప్రశంసించారా అని ప్రశ్నించారు. అందుకు ప్రశాంత్ నీల్ సమాధానం చెబుతూ ఎన్టీఆర్, మహేష్ బాబు తనకు ఫోన్ చేశారని తెలిపారు.

వీరిద్దరిలో ముందుగా ఎవరు ఫోన్ చేసి విష్ చేశారని చెప్పగా మహేష్ బాబు సినిమా చూసిన వెంటనే తనకు ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని తనకు విష్ చేసినట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు.అయితే ఇలా తనకు ఫోన్ చేసి తన గురించి ప్రశ్నించిన తర్వాత ఒకసారి మహేష్ బాబును కూడా కలిశానని, ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేసే విషయంలో మహేష్ బాబు ముందువరుసలో ఉంటారని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. తన మనస్తత్వం నాకు ఎంతగానో నచ్చుతుంది అవసరాలకోసం మనుషుల్ని ఉపయోగించుకోకుండా నిజాయితీగా మన టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారని మహేష్ బాబు గురించి ప్రశాంత్ నీల్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.