Bhairava dweepam : భైరవ ద్వీపం విడుదలయ్యాక అభిమానులు అలా చేశారట… 28ఏళ్ళు పూర్తి చేసుకున్న దర్శకులు సింగీతం అద్భుత సృష్టి…!

 

Bhairava dweepam : 9నంది అవార్డులు సొంతం చేసుకుని,మరోవైపు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిన బాలకృష్ణ సినిమా భైరవ ద్వీపం. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా రోజా రాకుమారి పాత్రలో నటించారు. ఇక బాలకృష్ణ సాహసం వీరుడు విజయ్ పాత్రలో నటించారు.రోజా రాకుమారి పాత్రలో నటించారు. ఇక బాలకృష్ణ సాహసం వీరుడు విజయ్ పాత్రలో నటించారు.1994 వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను మ్యాచ్ చేస్తూ సూపర్ హిట్ అయ్యింది. ఆదిత్య 369` వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని ప్రేక్షకులకు అందించిన ఘనవిజయం అందుకున్న బాలయ్య-సింగీతం కాంబోలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు వున్నాయి.

ఇక ఈ సినిమాలో అలనాటి సీనియర్ నటి కేఆర్ విజయ బాలకృష్ణ కు తల్లిగా నటించారు. విజయ్ కుమార్, కైకాల సత్యనారాయణ, సంగీత, విజయ రంగ రాజు, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్, మిక్కిలినేని, సుత్తి వేలు, కోవై సరళ, వినోద్, పద్మనాభం వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా విడుదలయ్యాక జరిగిన ఆసక్తికర విషయం ఇపుడు బయటికి వచ్చింది.

ఈ సినిమాలో బాలకృష్ణ శాపానికి గురవ్వడం వల్ల కురూపి గా మారుతాడు. ఇక బాలకృష్ణను అలా చూడలేని అభిమానులు థియేటర్లో కుర్చీలూ విరిచి విధ్వంసం చేశారట.ఇక వెంటనే దర్శకనిర్మాతలు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి వివరించారట.అయితే అప్పట్లో ఒక కమర్షియల్ మాస్ ఇమేజ్ ఉన్నా హీరో ఒక కురూపి వేషం వేయడం రిస్క్ తీసుకోవడమే అలాంటిది బాలయ్యబాబు చేయడం హిట్ కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ఇప్పటికి ఈ సినిమా, ఆదిత్య 369 సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి.