రాశీఖన్నా కి ఆ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం అదితీ రావు హైదరీ ..!

ఇటీవలే నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన వి సినిమాలో నాని కి జంటగా నటించింది అదితి రావు హైదరీ. మరో హీరోయిన్ గా సుధీర్ బాబు కి జంటగా నివేదా థామస్ నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ఆశించినంతగా సక్సస్ ని అందుకోలేకపోయింది. అయినా ఈ సినిమాలో నాని కి జంటగా నటించిన అదితీ రావు హైదరికి మాత్రం వరసగా తెలుగు తో పాటు తమిళంలోనూ మంచి ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయి.

Aditi Rao Hydari's first look from Nani starrer 'V' unveiled ahead of the  release - Republic World

మరోసారి నాని సరసన నటించనున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. అలాగే ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం సినిమాలో శర్వానంద్ కి జంటగా నటిస్తున్న రీసెంట్ గా ప్రకటించారు. ఇలా తెలుగులోనే రెండు సినిమాలు చేస్తున్న అదితీ రావు హైదరీ తమిళంలో కూడా నటిస్తుంది. కోలీవుడ్ హీరో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ”తుగ్లక్ దర్బార్”. ఢిల్లీ ప్రసాద్ దీనాదయలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ముందు అదితి రావు హైదరిని హీరోయిన్ గా ఎంచుకున్నారు. కొంత టాకీపార్ట్ షూటింగ్ కూడా కంప్లీటయింది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. కాగా రీసెంట్ గా ఈ సినిమాలో రాశీఖన్నా నటిస్తుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అంటే అదితి రావు హైదరి స్థానంలో రాశీఖన్నా వచ్చి చేరింది. అందుకు కారణం ఇప్పటికే అదితి రావు హైదరి ఒప్పుకున్న సినిమాల డేట్స్ మారిపోయాయి. ఈ కారణంగా ఈ సినిమా కంటే ముందు కమిటయిన సినిమాల డేట్స్ సర్ధుబాటు చేయాలి రావడంతోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అదితి రావు హైదరి తప్పుకుందట. ఇప్పుడు ఆ స్థానంలోనే రాశీఖన్నా వచ్చింది.