24న ప్రేక్షకుల ముందుకు ఆదికేశవ!

పంజా వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ‘ఆదికేశవ’ ఈ నెల 24న విడుదలకి సిద్ధం అవుతోంది. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించి, శ్రీలీల కథానాయికగా చేసిన ఈ సినిమా షూటింగ్‌ సమయంలో వైష్ణవ్‌ తేజ్‌ ఆహారం విషయంలో ఆసక్తికర అంశం బయటపెట్టాడు. వైష్ణవ్‌ తేజ్‌ లంచ్‌ లో ఏమి తింటాడో తెలిస్తే షాకవుతారు. పంజా వైష్ణవ్‌ తేజ్‌ ఈ నెల 24న విడుదలకి సర్వం సిద్ధం అయింది.

శ్రీకాంత్‌ రెడ్డి మొదటి సారిగా ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీలీల కథానాయిక, మలయాళం నటుడు జోజు జార్జి ఇందులో విలన్‌ గా కనపడనున్నాడు. ఈ సినిమాతో వైష్ణవ్‌ తేజ్‌ ని ఒక మాస్‌ నటుడిగా కూడా చూడొచ్చు. ఈ సినిమా ఇంతకు ముందే విడుదల కావలసి వుంది, కానీ ప్రపంచ క్రికెట్‌ కప్‌ ఉండటంతో ఈనెల 24న విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ సమయంలో కొన్ని ఆసక్తికరం అంశాలు చోటు చేసుకున్నాయి. వైష్ణవ్‌ తేజ్‌ షూటింగ్‌ జరిగే సమయంలో రోజూ మధ్యాహ్నం లంచ్‌ ఏమి తినేవాడో తెలిస్తే విూరు షాకువతారు. అతను బెండకాయ వేపుడు చేయించుకొని తెమ్మని అదే తినేవాడట. ఎందుకు అలా అంటే, ‘బెండకాయ వేపుడు అంటే నాకిష్టం, అందుకని అది తినేవాడిని’ అని చెపుతున్నాడు వైష్ణవ్‌ తేజ్‌.

అయితే ఇదేదో ఒకరోజు, రెండు రోజులు కాదు, రోజూ బెండకాయ వేపుడు తినేవాడు వైష్ణవ్‌. లంచ్‌ సమయం వచ్చింది అంటే, షూటింగ్‌ లో ప్రత్యేకంగా బెండకాయ వేపుడు వైష్ణవ్‌ కి చేసేవారు. అయితే దానికి ఏమంత కష్టపడనవసరం లేదు. షూటింగ్‌ లో ఎలాగు వంట చేస్తారు, అప్పుడే ఈ బెండకాయ వేపుడు కూడాను. అది కూడా చాలా సులువుగా వండే కూర, అందుకని దీనికి ఎక్కువ సమయం అవసరం లేదు, అలాగే ఎక్కువ కష్టపడనవసరం లేదు కూడాను.