మెల్లగా ట్రాక్ ఎక్కిన రీతువర్మ.. ఇన్నాళ్ళకి సాలీడ్ ప్రాజెక్ట్స్ పడ్డాయి ..!

హైదరాబాది అమ్మాయి రీతూ వర్మ షార్ట్ ఫిల్మ్ తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. అనుకోకుండా అన్న షార్ట్ ఫిలిం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రమణ్యం వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఈ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకోవడంతో పెళ్ళి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించే అవకాశం అందుకుంది.

Ritu Varma celebrates 4 years of Pelli Choopulu, pens an emotional note -  Movies News

ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ చిత్ర పరిశ్రమలోను గుర్తింపు పొందింది. కోలీవుడ్ లో విక్రం లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం అందుకుంది. అలాగే ఇప్పుడు తెలుగులో కూడా మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని తో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తుంది రీతూ వర్మ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగభాగం పూర్తయింది. మజిలీ, నిన్ను కోరీ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా మరో రెండు సినిమాలు సైన్ చేసింది ఈ తెలుగమ్మాయి. యంగ్ హీరో శర్వానంద్ నటించే తెలుగు, తమిళ సినిమాతో పాటు మరో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సరసన రీతూవర్మ నటిస్తోంది. ఈ సినిమాని లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమవుతున్న లక్ష్మీ సౌజన్య అద్భుతంగా సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్ళు రీతూవర్మ కి టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు దక్కించుకొని షాకిచ్చింది.