త్రిషకు క్షమాపణలు చెప్పిన నటుడు మన్సూర్‌!

కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిషకు తమిళ నటుడు మన్సూర్‌ ఆలీ ఖాన్‌ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు త్రిషపై ఇటీవలే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమిళ, టాలీవుడ్‌ చిత్ర ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయినప్పటికీ ఆయన మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చి చెప్పారు.

అయితే, పరిస్థితి తీవ్రత నేపథ్యంలో తాజాగా త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. ఈ మేరకు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ’నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్ధం చేశాను. ఈ వార్‌లో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి. అందుకు క్షమాపణలు కోరుతున్నా.

ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది’ అంటూ వెల్లడిరచారు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ ’లియో’ మూవీపై మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌రూమ్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నా. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్‌ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను. కానీ అలా జరగలేదు.

నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా రేప్‌ సీన్లు చేశాను. రేప్‌ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు. అంటూ మన్సూర్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో ఈ వార్తలు సోషల్‌ విూడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో మన్సూర్‌ అలీ ఖాన్‌ వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై త్రిష కూడా ఘాటుగా స్పందించింది.

మన్సూర్‌ అలీ ఖాన్‌ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరమైనదిగా అనిపిస్తోంది. అతనిలాంటి దయనీయ వ్యక్తితో ఇప్పటివరకు స్కీన్ర్‌ స్పేస్‌ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలిని. నా మిగిలిన కెరీర్‌ లో అలాగే నా సినిమాలో అతడు లేకుండా చూసుకుంటాను. మన్సూర్‌ అలీ ఖాన్‌ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుంది. అంటూ త్రిష ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.