SSMB30: ఎవరికి దక్కేనో?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చాక టైమ్ చూసుకొని థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ పాన్ వరల్డ్ మూవీ చేయాల్సి ఉంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ చిత్రాన్ని రాజమౌళి ఆవిష్కరిస్తారు.

ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటులను కూడా రంగంలోకి దించుతున్నారు. దీపికా పదుకొనే ఈ మూవీలో ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉండడానికి తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు.

అలాగే వంశీ పైడిపల్లితో ఒక మూవీ చేయడానికి ఎప్పుడో కమిట్ అయ్యారు. అలాగే వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీతో మహేష్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి, బాబీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే మహేష్ 29 సినిమా కంప్లీట్ అయ్యేసరికి కనీసం రెండేళ్ళకి పైగానే సమయం పట్టొచ్చు.

అంటే 2026 తర్వాత మహేష్ 30వ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండేళ్లలో ఎదైనా జరగొచ్చు. ఈ నేపథ్యంలో ఏ ప్రాజెక్ట్ మహేష్ 30గా సెట్స్ ఫైకి వెళ్తుంది అనేది వేచి చూడాలి. ఇక రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వచ్చే ఏడాది మార్చి తర్వాత సెట్స్ ఫైకి వెళ్లే ఛాన్స్ ఉందంట. ఆగస్టు తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వొచ్చని అంచనా.