చిరంజీవి ‘విశ్వంభర’ కోసం ప్రత్యేక సెట్‌!

ఆటా పాటతో సందడిగా సాగుతోంది ‘విశ్వంభర’ చిత్రీకరణ. హైదరాబాద్‌ శివార్లలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో చిరంజీవితోపాటు, కొద్దిమంది తారాగణంపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. శోభి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష కథానాయిక. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఇషాచావ్లా, సురభితోపాటు మరికొద్దిమంది భామలూ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫాంటసీ అడ్వంచర్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.