సూపర్‌ స్టార్‌? సినిమాలోకి ఆ ఇద్దరి ఎంట్రీ..

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌?- ‘జై భీమ్‌’ ఫేమ్‌? దర్శకుడు టి.జి జ్ఞానవేల్‌ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ మూవీ ‘తలైవర్‌? 170’. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌? పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో పలువురు స్టార్స్‌? కనిపించి సందడి చేయనున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌?లోకి రానా, ఫహాద్‌? చేరుకున్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం తన అప్‌?కమింగ్‌ మూవీపై దృష్టి సారిస్తున్నారు.

‘జై భీమ్‌?’ ఫేమ్‌ టి.జి జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాకు ఇటీవలే రజనీ సైన్‌? చేశారు. ‘తలైవర్‌? 170’ అనే వర్కింగ్‌? టైటిల్‌?తో ఈ సినిమా రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్‌? బ్యానర్‌?పై తెరకెక్కుతన్న ఈ భారీ బడ్జెట్‌? సినిమా ప్రస్తుతం ట్రెండిరగ్‌?లో ఉంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్న స్టార్స్‌? పేర్లు చెబుతూ ఓ స్పెషల్‌? పోస్టర్లను రిలీజ్‌? చేసింది.

కథానాయికలు మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌లు ఇందులో నటిస్తున్నట్లు చిత్రబృందం సోమవారం తెలిపింది. అయితే గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఓ బజ్‌?కు మూవీటీమ్‌ ఇప్పుడు ఫుల్‌?స్టాప్‌? పెట్టింది.టాలీవుడ్‌? స్టార్‌ హీరో రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో కీలక రోల్‌? ప్లే చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌? అధికారికంగా ప్రకటించింది.

ఈ విషయాన్ని ట్విట్టర్‌?లో తెలిపింది. ఇక రానాతో పాటు ఈ సినిమాలో మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌? ఫాజిల్‌? కూడా నటించనున్నారని చిత్రబృందం పేర్కొంది. ఇలా మూవీకి సంబంధించిన వరుస అప్‌డేట్‌లు రిలీజౌతున్న సందర్భంగా రజనీ ఫ్యాన్స్‌?లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. అయితే రానాను కన్ఫామ్‌? చేసే ముందు ఈ రోల్‌?కు టాలీవుడ్‌ హీరో నానిని సంప్రదించారని టాక్‌ వినిపించింది.

అయితే నాని ఇందుకు నో చెప్పారని.. ఆ స్థానంలో శర్వానంద్‌ని తీసుకునే ఛాన్స్‌? ఉందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత శర్వానంద్‌ కూడా సినిమాలో నటించేందుకు తిరస్కరించారని.. దీంతో ఆ అవకాశం దగ్గుబాటి రానాకు దక్కనుందని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఈ ట్వీట్‌?తో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.

వీరితో పాటు సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌?బీ అమితాబ్‌ బచ్చన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారని ఇన్‌?సైడ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్‌ సంచలనం అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించనున్నారు. 2024లో సినిమా రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌? ఉన్నట్లు తెలుస్తోంది.