గాసిప్స్ : భోళా బ్యూటీస్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట 

టాలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ గా రిలీజ్ కి రాబోతున్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ మూవీ ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం “భోళా శంకర్” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించగా దీనిని తమిళ్ లో అజిత్ కుమార్ నటించిన వేదాళం కి తెలుగు వెర్షన్ గా చేశారు.

ఇక ఈ చిత్రం విషయంలో గతంలో తాను చేసిన అజిత్ మూవీ బిళ్ళ రీమేక్ తెలుగులో కూడా ఎలా హిట్ అయ్యిందో ఇప్పుడు ఈ చిత్రం కూడా మళ్ళీ అజిత్ సినిమా రీమేక్ కాబట్టి హిట్ అవుతుంది అని మెహర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో భోళా శంకర్ బ్యూటీస్ గా స్టార్ హీరోయిన్ లు తమన్నా మరియు కీర్తి సురేష్ లు నటించారు.

అయితే ఇందులో తమన్నా హీరోయిన్ గా కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ రోల్ చేసింది. కాగా ఈ ఇద్దరు హీరోయిన్స్ కలిసి నెక్స్ట్ ఓ మల్టీ స్టారర్ చిత్రం చేస్తారని లేటెస్ట్ గా సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని కూడా దర్శకుడు మెహర్ రమేష్ నే ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రం అయితే భోళా శంకర్ సినిమా టైం లోనే వారికీ చెప్పి లాక్ చేసుకున్నాడట. దీనితో భోళా శంకర్ రిలీజ్ తర్వాత అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి అయితే భోళా తర్వాత ఖాళీ అయిపోతాడు అనుకున్న మెహర్ మొత్తానికి బిజీగా ఉండబోతున్నాడు అని చెప్పాలి.