రానా కథానాయకుడిగా `నీదీ నాదీ ఒకే కథ`ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో `విరాటపర్వం` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్కు, ఓ నక్సలైట్కు మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొత్త పంథాలో దర్శకుడు రూపొందిస్తున్నారు. `ఫిదా`తో తెలుగు ప్రేక్షకుల్ని తనకు ఫిదా అయ్యేలా చేసుకున్న నేచురల్ పెర్ఫార్మర్ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.
90వ దశకం నేపథ్యంలో సాగే పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాని తెరపైకి తీసుకొస్తున్నారు. ఉత్తర తెలంగాణలో 90ల కాలంలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగనుందని ప్రచారం జరుగుతోంది. అత్యధిక భాగం ఉత్తర తెలంగాణలోని రియల్ లొకేషన్లలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఇటీవల వరంగల్ జిల్లా పర్కాల్ బస్టాండ్లో సాయి పల్లవిపై చిత్రీకరించిన సన్నివేశాలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
చైతన్య వంతమైన గీతాల్ని ఆలపించే జానపద కళాకారిని నక్సలైట్గా మారిన వైనాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి పాత్ర జానపద కళాకారిని బెల్లి లలిత పాత్రని పోలి వుంటుందని తెలుస్తోంది. 99లో భువనగిరిలో బెల్లి లలితను నయీం గ్యాంగ్ కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమె శరీరాన్ని 17 ముక్కలుగా చేసి ఒక్కో ముక్కని ఒక్కో ప్లేస్లో పడేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తర తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ సన్నివేశాలు కూడా `విరాటపర్వం`లో కీలకంగా మారనున్నాయని ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోంది.
Virata Parvam will have Belli Laltha episode. She was a folk singer who took the maoist ideology into people. Who will essay this role in Virata Parvam?