మహేష్, దేవరకొండ మల్టీస్టారర్, డిటేల్స్

ఇది మల్టీస్టారర్ల సీజన్. ప్రతీ దర్శకుడు, హీరో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు. కలెక్షన్స్ కుంభవృష్టి కురవాలంటే ఒక హీరో సరిపోడని భావిస్తున్నారు. అయితే ఆ మల్టి స్టారర్ మాత్రం ఫుల్ క్రేజీగా ఉండాల్సిందే. ఇప్పుడదే జరగబోతోందని వినికిడి. మహేష్, దేవరకొండ మల్టిస్టారర్ కు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ , అనీల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందే ఈ చిత్రం కోసం దేవరకొండను సంప్రదించినట్లు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో మహేష్, దేవరకొండ ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. మహేష్ ది సిటీ బ్యాక్ డ్రాప్ పాత్ర అని, దేవరకొండది పక్కా తెలంగాణా పల్లెటూరి నేపథ్యం అని చెప్తున్నారు. అందుకోసం దేవరకొండ నైజాం యాక్సెంట్ కి తగ్గట్టు ఓ అదిరిపోయే రోల్ ని అనీల్ రావిపూడి క్రియేట్ చేసాడని వార్తలు వస్తున్నాయి.

ఇదే కనక నిజమైతే మహేష్ .. దేవరకొండ కాంబినేషన్ ఫ్యాన్స్ కు విజువల్ ఫెస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ట్రేడ్ పరంగా అటు ఆంధ్రా .. ఇటు తెలంగాణ రెండుచోట్లా బాక్సాఫీస్ ని షేకే చేస్తుందని నమ్ముతున్నారు.

జూన్ లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రష్మిక మంద హరోయిన్ గా ఫైనల్ అయిందని వార్తలొచ్చాయి. అయితే రష్మిక మహేష్ సరసన నటిస్తుందా లేక దేవరకొండ సరసన నటిస్తుందా? అనే విషయం తేలాల్సి ఉంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన `మహర్షి` ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 40 కోట్ల షేర్ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. తొలి వారం నాటికే ఈ సినిమా నా కెరీర్ రికార్డులన్నిటినీ తిరగరాస్తుందని మహేష్ స్వయంగా ప్రకటించారు.