`సైరా`కు మ‌రో స‌మ‌స్య‌

 
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. దేశ స్వాతంత్య్రానికి   పోరాటం స్టార్ట్ చేసిన తొలి వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.
 
ఈ సినిమాకు చిత్రీక‌ర‌ణ‌కు రియ‌ల్ లొకేష‌న్‌లో స‌మ‌స్య వ‌చ్చింది. వివ‌రాల్లోకెళ్లే.. సైరా యూనిట్ కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను బీద‌ర్‌లో చిత్రీక‌రించాల‌నుకున్నార‌ట‌. చిత్ర నిర్మాతలు అన్నీ ప‌ర్మిష‌న్స్ తీసుకున్నా కూడా.. ఆర్టిస్టుల ఉపయోగించే టోపీలు, జెండాలు అన్నింటినీ చూసి.. బీద‌ర్‌లోని లోక‌ల్ ప్ర‌జ‌లు సినిమా షూటింగ్‌కు నిరాక‌రించారు. సెన్సిటివ్ ఏరియా కాబ‌ట్టి జెండాలు, త‌ల‌పాగాలు ఉండే సినిమా స‌న్నివేశాలు తీస్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వారు భావించార‌ట‌. ఇక లోక‌ల్ ప్ర‌జ‌ల నుండి నిర‌స‌న‌లు రావ‌డంతో అన్నీ ప‌ర్మిష‌న్స్ ఉండి కూడా యూనిట్ ఏమీ చేయ‌లేక వెన‌క్కి తిరిగి రావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక హైద‌రాబాద్‌లోనే సెట్ వేసి స‌ద‌రు వ‌ర్క్‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నారు.
 
సురేంద‌ర్ రెడ్డి దర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌, న‌య‌న‌తార‌, విజ‌య్‌సేతుప‌తి, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు, కిచ్చా సుదీప్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ద‌స‌రాకు సినిమాను విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావిస్తోంది. 
-మోహన్ కుమార్