మహేష్ ని క్షమాపణ అడగటానికే చెన్నై వెళ్లారా?

 సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా మహేష్  ఆగిపోయిందంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక మహేష్ …అనీల్ రావిపూడి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు సుకుమార్ సైతం అల్లు అర్జున్ తో సినిమా అంటూ ప్రకటన వచ్చింది. ఇలా ఊహించని సంఘటనలు జరగటంతో అంతా ఆశ్చర్యపోయారు. 

దాదాపు పది నెలలు పాటు వీరిద్దరి మధ్యా స్క్రిప్టు డిస్కషన్స్ జరిగాయి కానీ మహేష్ కన్వీన్స్ కాలేదని , అందుకే సుకుమార్ ప్రక్కకు తప్పుకున్నాడని, గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో వీరిద్దరి మధ్యా విబేధాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. వాటికి సుకుమార్ చెక్ పెట్టాలనుకుంటున్నారట.

అందుకోసం సుకుమార్ పనిగట్టుకుని చెన్నై వెళ్లి మహర్షి సెట్ లో మహేష్ ని కలిసి అపాలజీ చెప్పారట. సుకుమార్ ఓ రోజు మొత్తం మహేష్ తోనే గడిపారట. అల్లు అర్జున్ తో ప్రాజెక్టు ప్రకటన వెనక ఏం జరిగింది అనేది మహేష్ కు ఎక్సప్లెయిన్ చేసారట సుకుమార్. అయితే మహేష్ నవ్వి లైట్ తీసుకోమని , మిగతా విషయాలు మాట్లాడారని చెప్తున్నారు. త్వరలో మహేష్ తో ప్రాజెక్టు ఎనౌన్స్ చేయాలని సుకుమార్ ప్లానింగ్ లో ఉన్నారట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

ఇక ఆ మధ్యన మహేష్ చేసిన ట్వీట్ ఇది.. ‘కొన్ని సృజనాత్మక అభిప్రాయ భేదాల వల్ల నేను సుకుమార్‌తో చేయాల్సి సినిమా ఆగిపోయింది. కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఓ దర్శకుడి సమర్ధతకు ఎప్పుడూ గౌరవం దక్కుతుంది. వన్‌ నేనొక్కడినే సినిమా ఓ కల్ట్‌ క్లాసిక్‌. ఆ సినిమా కోసం పని చేసిన ప్రతీ క్షణం ఎంజాయ్‌ చేశాను. మీ కొత్త సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు మహేష్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నేనొక్కడినే కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినా స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మంచి పేరు వచ్చింది.