ర‌మ్య‌కృష్ణ‌, విజ‌య‌శాంతి మధ్యలో మహేష్

ఒకప్పుడు టాలీవుడ్ ని ఊపిన సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, విజయశాంతి. వీరిద్దరు కలిసి కొన్ని సినిమాలు చేసారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు ఒకే సినిమాలో అదీ మహేష్ బాబు తో కలిసి కనిపించబోతున్నట్లు సమాచారం. అది కూడా ఒకరు మహేష్ కు అమ్మగా మరొకరు అత్తగాను అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా నలిగిపోయే పాత్రలో మహేష్ ఫన్ ని పండిస్తాడంటున్నారు.

వివరాల్లోకి వెళితే… సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి` ఈ నెల 9న విడుద‌ల‌కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి `ఎఫ్ 2`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్స్ విజ‌య శాంతి, ర‌మ్య‌కృష్ణ‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ు.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్‌కు ర‌మ్య‌కృష్ణ అమ్మ పాత్ర‌లో, విజ‌య‌శాంతి అత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారట‌. పోటా పోటీగా ఈ పాత్రలు రెండు తెరపై అదరకొట్టేలా డిజైన్ చేసారంటటున్నారు. ఈ చిత్రానికి `స‌రిలేరు నీకెవ్వ‌రూ` అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా క‌నిపించే ఈ చిత్రం… జూన్ నుండి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.