మహేష్ తో రమ్యకృష్ణ రచ్చ, ఓ రేంజిలో …

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ప్రారంభం కానున్న చిత్రం చాలా క్రేజి కాంబినేషన్ తో ప్రారంభానికి ముందే హాట్ టాపిక్ గా మారుతోంది. తన కెరీర్ లోని 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మహర్షి’ సినిమా తర్వాత మహేష్ బాబు హ్యాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి తో మాస్ ఎంటర్ టైనర్ సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే జగపతిబాబు, విజయశాంతి, బండ్ల గణేష్ వంటివారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలను ఎంపిక చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. జూలై నుంచి మొదలు కానున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూడా ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఈ మేరకు రమ్యకృష్ణకు కథ చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. నీలాంబరి తరహా పాత్ర అది అని, కొంత సీరియస్ నెస్ ఉన్నా, ఫన్ తో ముందుకు వెళ్తుందంటున్నారు. తన పాత్ర చెప్పిన వెంటనే ఎక్కేసి, నచ్చేయడంతో రమ్యకృష్ణ వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేసిందని సమాచారం.

రమ్యకృష్ణకు తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో మంచి పాపులారిటీ ఉండటంతో ఈ సినిమాకు బాగా కలిసి వస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. దానికి తోడు ఇక వరుస సూపర్ హిట్ సినిమాలతో అనిల్ రావిపూడి మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తన గత సినిమాల్లాగే ….ఈసారి కూడా మహేష్ బాబు తో ఒక ఫుల్ లెంత్ ఎంటర్ టైనింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.