షాక్: నిఖిల్ రెండు సినిమాలు కాన్సిల్, కారణం?

యంగ్ హీరో నిఖిల్‌, నివేదా థామస్‌ జంటగా ఓ చిత్రం రూపుదిద్దుకోనున్నదంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కిషన్‌ కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని, ఈ చిత్రానికి ‘శ్వాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశామని పోస్టర్ వదిలారు. తేజ్‌ ఉప్పలపాటి, హరిణికేశ్‌ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే ఈ చిత్రం ఆగిపోయినట్లే అని తెలుస్తోంది. కారణమేంటనేది ఎవరికి తెలియటం లేదు.

అంతేకాదు…ఆషియన్ సునీల్ నిర్మాతగా ప్రారంభం కానున్న చిత్రం సైతం ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా సైతం ఎందుకు ఆపేసారో తెలియరాలేదు. అయితే నిఖిల్ తన తదుపరి చిత్రంగా తన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ ని చందు మొండేటి డైరక్షన్ లో చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాపైనే పూర్తి కాన్సర్టేట్ చేస్తున్నారని, అది పూర్తయ్యే దాకా వేరే సినిమా ఒప్పుకోరని తెలుస్తోంది.

ప్రస్తుతం నిఖిల్‌ ‘అర్జున్ సురవరం’ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో తమిళంలో వచ్చిన ‘కణిథన్‌’ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇందులో నిఖిల్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నిఖిల్‌ విలేకరి పాత్రను పోషిస్తున్నారు.