బాలయ్య సినిమాలో మళ్ళీ నమిత,క్యారక్టర్ తెలిసే కమిటైందా?

బాలయ్య సినిమాలో నమిత,క్యారక్టర్ తెలిసే కమిటైందా?

బాల‌కృష్ణ‌, కేఎస్ ర‌వికుమార్ త్వ‌ర‌లో రూల‌ర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ద‌మవుతున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహ‌న్‌, వేదిక చిత్రంలో హీరోయిన్స్ గా నడిస్తున్నారు. భూమిక చావ్లా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌ే ఈ చిత్రంలో ఓ లేడీ విలన్ ఉంటుందిట. ఆ పాత్రకు గాను విల‌న్‌గా సినిమాలు చేసిన త‌మిళ భామ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ని తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావించిననప్పటికి, అది వ‌ర్కవుట్ కాలేదు.

అందుతున్న తాజా స‌మాచారం ప్ర‌కారం న‌మిత లేడీ విల‌న్‌గా చిత్రంలో అల‌రించ‌నుంద‌ని చెబుతున్నారు. ఈ వార్తే క‌నుక నిజ‌మైతే సింహా త‌ర్వాత బాల‌య్య‌, న‌మిత క‌లిసి న‌టించిన మ‌రో చిత్రం అవుతుంది. న‌మిత 2017లో తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో వేదమంత్రాల సాక్షిగా వీరేంద్రని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు త‌మిళంలో వరస సినిమాలు కమిటవుతోంది.నమిత చివరగా తమిళంలో భరత్ హీరోగా వచ్చిన పోటు అనే చిత్రంలో కనిపించింది. అంతే కాదు తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొని కొన్ని రోజులకే ఎలిమినేట్ అయ్యారు.

బాలయ్య-కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో ‘జై సింహ’ మూవీ వచ్చింది. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్ సాధించింది. ఇపుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. సి కళ్యాణ్ నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కబోతోంది.