టైటిల్ బాగుందికానీ…మహేష్ కు సెట్ అవుతుందా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమా అంటే అభిమానులే కాక సినీ ప్రేమికులు సైతం ఎదురుచూస్తూంటారు. టైటిల్ నుంచీ, టీజర్, ట్రైలర్ ఇలా విషయంలోనూ మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన సిట్యువేషన్. అందుకే ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి, చర్చించి టైటిల్ ని ఫైనలైజ్ చేస్తూంటారు. తాజాగా మ‌హేష్ 26వ చిత్రం టైటిల్ కు సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

మ‌హేష్ బాబు త్వ‌ర‌లో హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడితో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, జూన్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నారు.. ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ఫిక్స్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. అచ్చ‌మైన తెలుగు టైటిల్ అయితే సినిమాకి మంచి క్రేజ్ కూడా వ‌స్తుంద‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట‌.

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకులముందుకు రానుంది. ఈచిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.