మహేష్ సీరియస్ వార్నింగ్, ఎలర్టైన టీమ్

ఈ మద్య కాలంలో లీక్ లేకపోతే అది సినిమానే కాదన్నట్లుగా వరసపెట్టి సినిమాలు లీక్ లు అవుతున్నాయి. ఎన్టీఆర్‘అరవింద సమేత’ గానీ, ‘గీత గోవిందం’లో కీ సీన్స్ కానీ బయిటకు వచ్చి మేకర్స్ ని భయపెట్టాయి. ఇక ‘ట్యాక్సీవాలా’ అయితే ఏకంగా సినిమా మొత్తం బయటికి వచ్చేసింది. అయితే లక్కీగా వీటిల్లో వేటీకి లీక్ దెబ్బ పెద్దగా లేదు.

ఇప్పుడు మళ్లీ లీక్ టాపిక్ మొదలవ్వటానికి కారణం…. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’కి కూడా ఈ లీక్ తప్పకపోవటమే. ఈ సినిమా నుంచి ఒక సాంగ్ బిట్ ఎలా లీకైందో కానీ ఆన్ లైన్లో ప్రత్యక్ష్యమైంది. దాంతో టీమ్ వెంటనే ఎలర్టైంది. ఆ సాంగ్ లింక్ ని తొలిగించటమే కాక, ఇక నుంచి లీక్ కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నిటిమీదా దర్శకుడు వంశీ పైడిపల్లి తన టీమ్ తో డిస్కస్ చేసి కొన్ని కఠినమైన డెసిషన్స్ తీసుకున్నారట.

మహేష్ బాబు సైతం ఈ విషయంలో యూనిట్లోని అందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా లీక్ లు మూలమైన… సెల్ ఫోన్లపై నిషేధం పెట్టారట. ఎడిటింగ్ రూంలో అయితే నిరంతర నిఘా ఉంచుతున్నరట. ఇలా రకరకాల జాగ్రత్తలుతో ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో టీమ్ ఉండాలని వంశీ పైడిపల్లి ఆర్డర్ పాస్ చేసారట.

ఇక ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో వేసిన విలేజ్ సెట్లో షెడ్యూల్ పూర్తయింది. మరో చిన్న షెడ్యూల్లో టాకీ పార్ట్ పూర్తవుతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లోకి టీమ్ దూకేస్తుంది. ఇలా స్పీడుగా చేస్తే .. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి అన్ని విధాల ముందుగా ఉండవచ్చు.ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు.. అశ్వినీదత్.. పీవీపీ కలిసి నిర్మిస్తున్నారు.