షాకింగ్ :అల్లు అర్జున్, మహేష్ ని రాజమౌళి పిలవలేదా?

రమా, రాజమౌళిల కుమారుడు కార్తికేయ వివాహం పూజా ప్రసాద్‌తో రేపు(డిసెంబర్ 30) జరగనుంది. ఈ వివాహ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. పూజ ప్రసాద్ ప్రముఖ నటుడు జగపతిబాబు అన్న రాంప్రసాద్ కూతురు. పూజా ప్రసాద్ గాయని. భక్తి గీతాలు ఆలపిస్తూ సంగీత అభిమానులను ఆకట్టుకొంటున్నారు. వీరి వివాహ వేడుకకు జైపూర్‌లో ఓ ప్రైవేట్‌ హోటల్‌ లో జరుగుతోంది. ఈ వివాహ నిమిత్తం కోసం రాజమౌళి ఓ నెల రోజుల పాటు హాలిడేస్‌ కూడా తీసుకున్నారు.

రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కూడా గురువారమే జైపూర్‌ చేరుకున్నారు. అలాగే తెలుగు సినీ ప్రముఖులంతా శుక్రవారం జైపూర్‌ చేరుకున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, అనుష్క తదితరులుఈ వేడుకకు హాజరయ్యి ఇప్పటికే రచ్చ చేస్తున్నారు. అయితే ఈ వివాహ వేడుకులో అల్లు అర్జున్, మహేష్ బాబు కనపడలేదు. దాంతో వారిద్దరినీ రాజమౌళి పిలవలేదంటూ మీడియాలో ప్రచారం మొదలైంది.

అయితే రాజమౌళికి గానీ జగపతిబాబుకు కానీ ఈ ఇద్దరితో వివాదాలు ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా పిలిచే ఉంటారు. తమ పర్శనల్ పనులు, ముందే అనుకున్న షెడ్యూల్స్ లో వాళ్లిద్దరు బిజీగా ఉండి ఉండటంతో వెళ్లి ఉండరు అని తెలుస్తోంది. అయితే ఇక్కడే మరో సందేహం వస్తోంది. రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్ పిలిచాక ..ఎన్ని పనులు ఉన్నా ప్రక్కన పెట్టి వెళ్తారు కదా ..అని అంటున్నారు. అదీ నిజమే. వీళ్లిద్దరూ ఈ వివాహ రిసెప్షన్ లో కనపడతారని ఆశిద్దాం.

ఇక ఈ పెళ్లి జంట కార్తీకేయ, పూజా ప్రసాద్ గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పి ఇటీవల ఒప్పించారని సమాచారం. దాంతో వీరిద్దరికి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. కాగా . కార్తికేయ బాహుబలి చిత్రానికి దర్శకత్వం విభాగంలో పనిచేశారు. ఆయన బాహుబలి సెకండ్ యూనిట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.