‘మహర్షి’ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదేనా ?

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్‌బాబు చేస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం ఇప్పటికి విడుదలైన ప్రమోషన్ ఏక్టివిటీస్ తో ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంభందించిన విషయం ఒకటి బయిటకు వచ్చింది. ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలబడతాయని సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా వంశీ పైడిపల్లి కసరత్తు చేసి రూపొందించాడని సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ ..ఇంటర్వెల్ లో ఇండియాకు బయిలు దేరతాడు అని, ప్రీ ఇంటర్వెల్ సీన్స్ లో తండ్రికు, మహేష్ కు మధ్య జరిగే సంభాషణ ఓ రేంజిలో ఉంటుందని, అక్కడ నుంచే మహేష్ నిర్ణయం మార్చుకుని ఓ ఛాలెంజ్ గా ఇండియా ప్రవేశిస్తాడని టాక్.

ఫస్టాఫ్ మొత్తం అమెరికాలో ఓ పెద్ద కోటీశ్వరుడుగా కథ నడిస్తే సెకండాఫ్… పల్లెలో జరుగుతుందని..తెలుస్తోంది. సెకండాఫ్ మొత్తం నిలబడేలా ఇంటర్వెల్ సీన్ ఉంటుందని, ఇప్పటిదాకా మహేష్ చేయని సీన్ గా ఇది నిలిచిపోతుందని చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రంలో చిత్రంలో కీలకమైన కాలేజీ ఎపిసోడ్‌లను డెహ్రాడూన్‌లో, ఇండ్రస్టిలియస్ట్ గా మహేష్ కనిపించే ఎపిసోడ్‌లను అమెరికాలో షూట్ చేశారు. ఇక ముఖ్యమైన సెకండాఫ్ ఎమోషనల్ సీన్లు అన్నింటినీ గ్రామీణ నేపథ్యంలో షూట్ చేస్తున్నారు. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.