రానాకి కిడ్నీ మార్పిడి, తల్లి డోనరా?నిజం ఏమిటి

సురేష్ బాబు పెద్ద కుమారుడు, బాహుబ‌లి విల‌న్ బ‌ళ్లాల‌దేవా అయిన రానా దగ్గుపాటి గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు మీడియాలో గుప్పుమన్నాయి. ఆ వార్తల సారాశం ఏమిటంటే..రానాకు రెండు కిడ్నీలు చెడిపోయి అవ‌స్థ‌లు ప‌డుతున్నాడని, అమెరికా లేదా సింగ‌పూర్‌లో కిడ్ని మార్పిడి చేసుకునే ప్ర‌య‌త్నంలో కూడా ఉన్న‌ట్లు ప్రచారం చేసేస్తున్నారు.

మరికొందరు అయితే….. రానా త‌ల్లీ కిడ్ని ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చినా… ఆమెకు హై బీపీ ఉండ‌డంతో సాధ్యం కాద‌ని డాక్ట‌ర్లు తేల్చేసిన‌ట్లు చెప్పేస్తున్నారు. వీటీలో ఎక్కువ భాగం యూట్యూబ్ లో వ్యూస్ కోసం పెడుతున్న వీడియో వార్తలే. అయితే వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు కానీ… తాజాగా రానా ఆరోగ్యం పై ఒక షాకింగ్ కథనాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించి షాక్ ఇచ్చింది.

రానా వచ్చే వారంలో తన కిడ్ని ట్రాన్స్ ప్లెంటేషన్ కోసం అమెరికా కానీ సింగపూర్ కాని వెళ్ళడం ఖాయం అనీ అయితే అతడి విదేశీ ప్రయాణ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతున్నట్లు ఆ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతేకాదు రానాకు కిడ్నీని ఇవ్వబోతున్న డోనర్ రానా తల్లి శ్రీమతి లక్ష్మి అంటూ ఆకథనంలో పేర్కొంది.

అంతేకాదు రానాకు వచ్చిన ఈ కిడ్నీ సమస్య ‘బాహుబలి’ కోసం రానా విపరీతమైన బరువు పెరగడం వలన కాదనీ రానాకు వంశ పారంపర్యంగా వచ్చిన లక్షణం ఇది అని వైద్యులు అభిప్రాయ పడుతున్నట్లు ఆ ఆంగ్ల పత్రిక షాకింగ్ కథనాన్ని ప్రచురించింది.

రానా కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు అందించిన లీకుల ప్రకారం తాము ఈవార్తను ప్రచురిస్తున్న విషయాన్ని ఆప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం…ఈ వార్తల్లో కొంతే నిజముందని తెలుస్తోంది. రానా కు కిడ్నీకు సంభందించిన ప్లాబ్లం వచ్చిన మాట నిజమే కానీ అది అంత సీరియస్ విషయం కాదట. అత్యంత నిపుణులైన వైద్యుల పర్య వేక్షణలో ట్రీట్మెంట్ ఇస్తున్నారట. రికవరీ కూడా అవుతున్నాడట. అయితే స్లోగా రికవరీ అవతున్నారట. అంతేకాదు ఈ ట్రీట్మెంట్ లో భాగంగా ..సిగరెట్లు కాల్చడం ఆపేసారట. అదీ సంగతి.