‘మహర్షి’ డైరక్టర్ నెక్ట్స్ ఏ హీరోతో నంటే…

కెరీర్ లో వరస హిట్స్ తో కమర్షియల్ డైరక్టర్ గా ఎదిగిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తాజాగా మహేష్ తో మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చి ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. అయితే అంత పెద్ద హిట్ ఇచ్చిన డైరక్టర్ తో చేయాలని ఇండస్ట్రీలో ప్రతీ హీరో ఎదురుచూస్తూంటాడు. ఈ నేపధ్యంలో వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రం ఏ దర్శకుడుతో చేయబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు మహర్షి హిట్ తర్వాత ఒక్కసారిగా వంశీ పైడిపల్లి హీరోలకు,నిర్మాతలకు హాట్ ప్రాపర్టీగా కనపడుతున్నారు. చాలామంది నిర్మాతలు ఇప్పటికే ఫ్యాన్సీ ఆఫర్లు తో కలుస్తున్నారు. అయితే వంశీ పైడిపల్లి ఎవరకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కథ చేసుకున్నాక నేనే వచ్చి కలుస్తాను అంటూ పెండింగ్ పెడుతున్నారు. అలా అటు హీరోలు, ఇటు నిర్మాతలు వంశీ పైడిపల్లి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే వంశీ పైడిపల్లి మాత్రం తన నెక్ట్స్ మూవీని దిల్ రాజు బ్యానర్ లోనే చేయబోతున్నాడని… ఈ మేరకు వీళ్లిద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరిందని సమాచారం. అలాగే హీరోల విషయానికొస్తే, వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇధ్దరూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. గతంలో ఈ దర్శకుడితో ఇద్దరూ కలిసి పనిచేసిన అనుభవం ఉంది.

ఎన్టీఆర్ సైతం వంశీతో మరోసారి వర్క్ చేయడానికి సై అన్నారట. అదే సమయంలో తాను ఎప్పుడూ పైడిపల్లితో చేయటానికి సిద్ధమని మహేష్ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అయితే మెగా హీరోతోనే వంశీ పైడిపల్లి ముందుకు వెళ్తారని, అదీ దిల్ రాజు బ్యానర్ లోనే అంటున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.