మెగా హీరోతో బాబి సినిమా, డైరక్టర్ వేరే

సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ చిత్రాలు డైరక్ట్ చేసిన దర్శకుడు బాబీ ఇప్పుడు వెంకీ మామ చిత్రం చేస్తున్నారు. నాగచైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇలా ఓ ప్రక్క డైరక్షన్ లో బిజీగా ఉన్న బాబి త్వరలో నిర్మాతగా కూడా మారనున్నారు.

సప్తగిరి ఎక్సప్రెస్, వజ్ర కవచధర గోవింద చిత్రాల దర్శకుడు అరుణ్ పవార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో హీరోగా సాయి ధరమ్ తేజ ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ మేరకు సాయి ని కలిసి కథ చెప్పారని, ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. బాబి సూచనలు సలహాలతో ఈ స్క్రిప్టు రెడీ కానుంది. త్వరలోనే ఫుల్ స్క్రిప్టు సాయి కు నేరేట్ చేయబోతున్నారని వినికిడి.

ఇక బాబి తాజా చిత్రం వెంకీ మామ విషయానికి వస్తే..‘ఎఫ్‌2’తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్‌.. తాజాగా ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీ అయ్యారు. నాగ చైతన్య, వెంకటేష్‌ కలిసి నటిస్తుండటంతో.. ఈ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.

ఈ చిత్రంలో వెంకటేశ్, నాగచైతన్య నిజజీవితంలో మాదిరిగానే మామాఅల్లుళ్లుగా నటించనున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు.