బాలయ్యకు దిల్ రాజు అదిరిపోయే ప్రపోజల్, ఓకే చేస్తాడా?

బాలయ్యకు ఆ సినిమా చూపించి, దిల్ రాజు రీమేక్ ప్లాన్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కు చిరంజీవి, బాలకృష్ణలతో సినిమా చేయాలనేది డ్రీమ్. వాళ్లతో సినిమా చేస్తే దాదాపు అందరి స్టార్స్ తో సినిమా చేసిన క్రెడిట్ వస్తుంది. ఇప్పటికే చిరంజీవి తాను దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు బాలయ్యను సైతం సీన్ లోకి లాక్కురావటానికి ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు. అందుకు పింక్ రీమేక్ ను ఎంచుకున్నట్లు సమాచారం.

రీసెంట్ గా అజిత్ నటించిన పింక్ సినిమా రీమేక్ ని దిల్ రాజు చూడటం జరిగింది. తమిళ వెర్షన్ రైట్స్ తీసుకుని దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఆయన అనుకున్నారట. అందుకు ఫెరఫెక్ట్ నటుడు బాలయ్యే అనిపించింది. ఈ విషయమై గతంలో మీడియాలో వార్తలు కూడా రావటంతో దిల్ రాజు ఆ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఈ సినిమాలో హీరో లాయిర్ గా కనిపిస్తారు. అయితే నడి వయస్సు దాటిన లాయిర్ పాత్ర అది. తమిళంలో కొద్ది మార్పులు చేసి అజిత్ తో అదరకొట్టారట. దాంతో ఆ సినిమాని చూపించి బాలయ్య తో ఓకే చేయించుకోవాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

‘పింక్‌’ తమిళ రీమేక్‌ను అజిత్‌తో తీస్తున్నారు . షూటింగ్ పూర్తయింది. ‘నేర్‌కొండ పార్‌వై’ టైటిల్‌తో బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్‌పాటు శ్రద్ధా శ్రీనాథ్, విద్యా బాలన్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి ఆదరణ లభించింది.

ప్రస్తుతం బాలయ్య ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ తో సినిమా చేస్తున్నారు. అందులో పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం అనంతరం దిల్ రాజు ఈ సినిమా ని పట్టాలు ఎక్కించే ఆలోచన లో ఉన్నారట. బాలయ్యతో గతంలో సినిమా చేసిన దర్శకుడుతో ఈ ప్రాజెక్టు ఉండే అవకాసం ఉందిట.