ఈ వార్త చదివి బాలయ్య మండి పడుతున్నారట

ఈ వార్త చదివి బాలయ్య మండి పడుతున్నారట

బాలయ్య చాలా కూల్ పర్శన్ అని చెప్తారు. డైరక్టర్ కు ప్రతీ విషయంలో సహకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆయన కొన్ని విషయాల్లో మాత్రం భయంకరమైన కోపం వస్తుందిట. ఆయన గురించి, ప్యామిలీ గురించి రూమర్స్ చదివినా, ఆయన చెవిన పడ్డా…కోపం తారా స్దాయికి వెళ్తుందిట. ఇప్పుడు ఆయన పరిస్దితి అదే అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కొత్త సినిమా గురించి ఓ వార్త స్ర్పెడ్ అవుతోంది. అసలు ఏమీ అనుకోకండానే టైటిల్ తో సహా మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ విషయంలో ఆయన చాలా ఆగ్రహంతో ఉన్నారట. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటీ అంటే..

హిందీలో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌ తెలుగు రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తుండగా.. ఈ మూవీని బాలయ్యతో చేయాలనుకుంటున్నాడట రాజు. అందులో అమితాబ్ కారెక్టర్‌ బాలయ్యతో చేయించాలన్న పట్టుదలతో ఈ నిర్మాత ఉన్నాడట. దీనికి సంబంధించి బాలకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం లాయర్ సాబ్ అనే టైటిల్‌ కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ మూవీకి బోని కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పింక్ మూవీని ఇటీవలే తమిళ్‌లో రీమేక్ చేశారు. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్‌తో వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. బోని కపూర్ నటించారు. ఈ మూవీపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.