సుకుమార్ కు దిల్ రాజు దెబ్బకొట్టాడా?!

రామ్ చరణ్ కి ‘రంగస్థలం’తో బ్లాక్ బస్టర్ అందించారు సుకుమార్. ఆ తరువాత సినిమాను మహేష్ బాబుతో ప్లాన్ చేసుకున్నాడు. కానీ రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకెల్లలేదు…సరికదా..అపోహలు, వివాదాలు,విభేధాలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. సరే కదా అని అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సుకుమార్ స్పీడు అయ్యాడు.

త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయనున్న సినిమా పూర్తయిన వెంటనే ఆయనతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. అయితే సుకుమార్ ప్లానింగ్ కు దిల్ రాజు దెబ్బకొట్టాడంటున్నారు. ఊహించని విధంగా తన క్యాంప్ డైరక్టర్ వేణు శ్రీరామ్ ని సీన్ లోకి తెచ్చాడని తెలుస్తోంది.

రీసెంట్ గా ఎమ్.సి. ఎ చిత్రం డైరక్ట్ చేసిన వేణు శ్రీరామ్ …అల్లు అర్జున్ ని కలిసి కథ వినిపించటం జరిగింది. ఆ కథ చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించడంతో, సుకుమార్ ప్రాజెక్టు కంటే ముందుగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ వున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడతోంది.

దానికితోడు ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో, ఆయన కూడా ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ముందుకు వెళ్లే అవకాసం ఉంది. ఊహించని విధంగా జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే ఈ ఏడాది సుకుమార్ సినిమా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు కనుక ముందుకు రాకపోతే సుకుమార్ కు సమస్యలేకపోను అని చెప్తున్నారు. సుకుమార్ ని సైతం గతంలో దిల్ రాజే ప్రమోట్ చేసారు.