ఏంటి రావు రమేషా …సమంత షాక్

ఎంత స్టార్ హీరోయిన్ అయినా..కొన్ని ఆమెకు కూడా షాకయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. రీసెంట్ గా దర్శకురాలు నందినీ రెడ్డి ..మీ కొొడుకుగా రావు రమేష్ చేస్తున్నాడు అనేసరికి…షాక్ అయ్యిందిట. అదేంటి..నా తండ్రి పాత్ర కదా రావు రమేష్ చేసే వయస్సు అందిట. అని ఓ నిముషం..తను చేస్తున్న చిత్రం కథ ఆలోచించి…మంచి ఆప్షన్ ..రేపు జనం కూడా ఇదే టాపిక్ మాట్లాడుకుంటారని మురిసిపోయిందిట. 

సమంత లాంటి స్టార్ హీరోయిన్ కు కొడుకు గా రావు రమేష్ కనిపించటం ఏమిటని ఇప్పుడు మీకు అనిపిస్తోంది కదా…అయితే అది నిజం. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రంలో ఈ విచిత్రం చోటు చేసుకోనుంది. ఈ సినిమాలో సమంతకు కోడలు,మనవడు కూడా ఉండబోతున్నారు.

గత కొన్నేళ్లుగా సమంతను వెండి తెర మీద వివిధ గ్లామర్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులు ఇంకొద్ది రోజుల్లో డిఫెరెంట్ గా చూడనున్నారు. సమంత రీసెంట్ గా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ రీమేక్ ఒకటి. ఇందులో సమంత 70 ఏళ్ల బామ్మగారుగా కనిపించనుంది. ఆవిడకు కొడుకు, కోడలు, మనవడు ఉంటారు.

ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించనున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోంది. అలాగే ఈ చిత్రానికి “ఓ ..బేబి”. ‘ట్యాగ్ లైన్ …ఎంత సక్కగున్నావే అనే టైటిల్ పెడుతున్నట్లు సమాచారం. రంగస్దలం చిత్రంలో లచ్చిమి ఎంత సక్కగున్నావే పాటలో లైన్ నుంచి ఈ టైటిల్ తీసుకున్నట్లు అర్దమవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

2014 లో విడుదలైన ఈ చిత్ర కథ విషయానికొస్తే.. 70 ఏళ్ల ఓ బామ్మకు తాను వయసులో ఉన్నప్పుడు అచ్చంగా తనలాగే ఉన్న20 ఏళ్ల యువతి కనపడుతుంది. ఆ అమ్మాయిని చూసి బామ్మ షాకవుతుంది. ఆ తరువాత ఏంజరుగుతుందన్నదే సినిమా కథ. సో.. బామ్మ పాత్రను సమంత పోషించనున్నట్లు టాక్.