2020 సంక్రాంతి ఫైట్‌: నువ్వా నేనా అంటూ స్టార్ హీరోల క‌లహం!

సంక్రాంతి బ‌రిలో నువ్వా నేనా? అన్న పోరు క‌నిపిస్తోంది. ముఖ్యంగా బ‌న్ని-అల వైకుంఠ‌పుర‌ములో.. మ‌హేష్‌- స‌రిలేరు నీఎవ్వ‌రు సినిమాల‌కు థియేట‌ర్ల కేటాయింపు విష‌యంలో ఏదో మ‌త‌ల‌బు ఉంద‌న్న చర్చా వేడెక్కిస్తోంది. ఇక రిలీజ్ తేదీ విష‌యంలోనూ నువ్వా నేనా అన్న పోటీ న‌డుస్తోంది. తాజాగా బాస్ అర‌వింద్ ప్ర‌క‌ట‌న చూస్తే.. ఇంకా రిలీజ్ తేదీ స‌స్పెన్స్ వీడ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

“సేమ్ డే వచ్చినా.. మర్నాడు వచ్చినా మా సినిమాకు ఒకే విధంగా థియేటర్లు వస్తుంటే.. మర్నాడు ఎందుకు రావాలి” అంటూ అర‌వింద్ విసిరిన పంచ్ కి దిల్ రాజుకు మైండ్ బ్లాంక్ అయిపోయింద‌ట‌. ఈ ప్ర‌శ్న‌కు ఆయ‌న ద‌గ్గ‌ర అస్స‌లు ఆన్స‌ర్ లేద‌ని వినిపిస్తోంది. దీంతో అర‌వింద్ ని ఒప్పించ‌లేమ‌ని డిసైడ్ అయిపోయిన రాజుగారు నేరుగా బ‌న్నీనే సంప్ర‌దించాల‌ని భావిస్తున్నారు. ఇక బంతి బ‌న్ని కోర్టులోనే ఉంది. అన్న‌ట్టు స‌రిలేరు కంటే ముందే మ‌నం రావాలి! అని బ‌న్ని ఇంత‌కుముందే నిర్మాత‌ల‌కు హుకుం జారీ చేశాడ‌న్న చ‌ర్చా సాగింది. మొత్తానికి స్టార్ హీరోల మ‌ధ్య నువ్వా నేనా అనే పోరు అలానే ఉంద‌ని ఈ ప‌రిణామం చెబుతోంది. ఇంత‌కీ బ‌న్ని జ‌న‌వ‌రి 12కి  ఫిక్స‌యిన‌ట్టేనా? అంటే సందేహ‌మే. ఇక మ‌హేష్ సైతం ఏమాత్రం త‌గ్గేట్టు లేడ‌న్నది ఇన్ సైడ్ టాక్.