`సైరా` ప్రీ రిలీజ్ వెన్యూ ఆయన జన్మభూమిలోనే…

`సైరా` ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ,డేట్ ఫిక్స్

ప్రస్తుతం మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. మరో 28 రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేసి ప్రాజెక్టుకు ఊపు తేవటానికి నిర్ణయించారు దర్శక,నిర్మాతలు. అయితే ఎక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే రకరకాలుగా డిస్కస్ చేసిన టీమ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు కర్నూల్ లో ఈ నెల 15న సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరపడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే చిత్ర యూనిట్ దీని అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ లోనే జన్మించడంతో అక్కడే ఈ చిత్ర ఈవెంట్ జరపాలని నిర్మాతలు భావించారు.

ఈ ఈవెంట్ కు దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లు – అమితాబ్ బచ్చన్, రజినికాంత్లను తీసుకురావాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అదే జరిగితే జాతీయ స్థాయిలో ఈ ఈవెంట్ కు పబ్లిసిటీ వచ్చి సినిమాకు కావాల్సిన ప్రమోషన్ వచ్చేసినట్టే. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగనట్టుగా దీనిని చెయ్యాలని రామ్ చరణ్ కోరికగా ఉందట.

మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందకు ఇప్పటికే ఆయా భాషలకు చెందిన నటీనటులతో సినిమాకు వాయిస్ – ఓవర్ ఇప్పించారంట. తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళ లో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యశ్, హిందీలో అమితాబ్ బచ్చన్ ‌ఉయ్యాలవాడ గురించి సినిమాలో చెబుతారట.