ఆ స్టార్ డైరక్టర్ కు‘సైరా’స్పెషల్ స్క్రీనింగ్

ఆ స్టార్ డైరెక్టర్ కి ‘సైరా’ స్పెషల్ షో !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎందిరించిన మొట్ట మొదటి తెలుగు విప్లవ నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు.

ఇక ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సినీ పరిశ్రమలోని కొంతమందికి సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకంగా త్వరలో స్పెషల్ షో వేయనున్నారని తెలుస్తోంది. రాజమౌళి నుండి సినిమాకి సంబంధించి విలువైన సలహాలను సూచనలను తీసుకోవాలని సైరా మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.

తన తల్లి కోరిక మేరకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో భారీ బడ్జెట్‌తో తన తండ్రికి కానుకగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై చాలా అంచనాలే ఉన్నాయి. ఈ స్దాయి బడ్జెట్ పెట్టుతూండటంతో సినిమా రిలీజ్ టైమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార  హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.