Vodafone Idea Vi 5G: మే 2026 నాటికి మరో 90 నగరాల్లో ‘వి’ (Vi) 5జీ సేవలు

Vodafone Idea Vi 5G: ప్రముఖ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ‘వి’ (Vi) తమ వినియోగదారులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తున్నట్లు కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మే 2026 నాటికి మరో కొత్తగా 90 నగరాలకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం ‘వి’ (Vi) 43 నగరాల్లో మాత్రమే 5జీ సేవలను అందిస్తోంది. తాజా విస్తరణతో ఈ సంఖ్య 133 నగరాలకు చేరుకోనుంది. 5జీ మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, అధిక డేటా వినియోగం ఉన్న పట్టణాలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ విస్తరణలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన పర్యాటక, వ్యాపార కేంద్రాలకు ప్రాధాన్యత కల్పించారు.

ఆంధ్రప్రదేశ్: తిరుపతి

తెలంగాణ: హైదరాబాద్

ఇతర నగరాలు: చెన్నై, కోయంబత్తూర్, గోవా, పుదుచ్చేరి, వారణాసి, ప్రయాగ్‌రాజ్ వంటి పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి.

తమ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పటిష్టం చేసేందుకు వొడాఫోన్ ఐడియా ‘వి’ (Vi) గ్లోబల్ టెక్నాలజీ సంస్థలైన ఎరిక్సన్ (Ericsson), నోకియా (Nokia), శాంసంగ్ (Samsung) లతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.

“5జీ డివైజ్‌ల వాడకం ఎక్కువగా ఉన్న కీలక మార్కెట్లలో సేవలను విస్తరించాలన్న మా వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ దశ విస్తరణతో ప్రధాన నగరాల్లో మా వొడాఫోన్ ఐడియా 5జీ నెట్‌వర్క్‌ను గణనీయంగా పెంచుతున్నాం. వినియోగదారులకు మెరుగైన డిజిటల్ అనుభూతిని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం.” — జగ్బీర్ సింగ్, సీటీఓ, వొడాఫోన్ ఐడియా

ఈ విస్తరణ ద్వారా వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్, తక్కువ లాటెన్సీ (Latency) మరియు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. ముఖ్యంగా గేమింగ్, స్ట్రీమింగ్ మరియు వ్యాపార అవసరాలకు 5జీ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. మే 2026 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి, వినియోగదారులకు పటిష్టమైన నెట్‌వర్క్ అందించడమే లక్ష్యంగా వొడాఫోన్ ఐడియా ‘వి’ అడుగులు వేస్తోంది.

Chillagattu Sreekanth About Thota Trimurthulu Politics in Mandapeta | TDP | YCP | Telugu Rajyam