టాలీవుడ్ దర్శకుడికి త్రిష ‘నో’ చెప్పిందా.? కానీ, ఎందుకు.?

హీరోయిన్ త్రిష ప్రస్తుతం తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తోంది. మొన్నామధ్యన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటించి మెప్పించింది త్రిష. ఆ సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్‌లోనూ సందడి చేసిన త్రిష, మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధంగానే వున్నట్లు చెప్పింది.

త్రిష తెలుగులో నటించి చాన్నాళ్ళే అయ్యింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగి వుంటే, ‘ఆచార్య’ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించి వుండేది. ఆమెని తీసేసి కాజల్ అగర్వాల్‌ని తీసుకొచ్చారు. అయితే, సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రే లేకుండా చేసేశారు.. ఆమెతో కొన్ని సీన్స్ చిత్రీకరించినప్పటికీ.

ఇక, అసలు విషయమేంటంటే తాజాగా ఓ యంగ్ డైరెక్టర్, త్రిషని సంప్రదించాడట టాలీవుడ్‌లో తాను తెరకెక్కించనున్న ఓ సినిమా కోసం. ఓ సీనియర్ హీరోతో సినిమా తెరకెక్కించేందుకుగాను హీరోయిన్ వేటలో పడ్డ ఆ దర్శకుడికి త్రిష అయితే బావుంటుందనిపించిందట. కానీ, త్రిష మాత్రం ‘నో’ చెప్పేసిందట. కథ నచ్చలేదా.? గత అనుభవాల వల్లనే త్రిష ఇలా చేసిందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.