Dr. Manne Ravindra: తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నేటితో మరో మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర గారు రాష్ట్ర ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజా సేవ: “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలే పార్టీకి పునాదులని డాక్టర్ మన్నె రవీంద్ర పేర్కొన్నారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు తెచ్చిన ఘనత కేవలం టీడీపీకే దక్కుతుందని ఆయన కొనియాడారు.

సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్: దేశంలోనే సంక్షేమ పథకాలను మొదటిసారిగా ప్రజలకు పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం అని, పేదలకు అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటుందని మన్నె రవీంద్ర స్పష్టం చేశారు. కేవలం సంక్షేమమే కాకుండా, ప్రపంచ స్థాయిలో తెలుగువారిని అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో పార్టీ అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు.
తెలుగు జాతి అభ్యున్నతే లక్ష్యం: ప్రస్తుత తరుణంలో తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే మనందరి లక్ష్యం కావాలని, అందుకు ప్రతి ఒక్క కార్యకర్త పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

