ఇమ్రాన్ ఖాన్ ‘నోబెల్ శాంతి’ బహుమతి ప్రతిపాదనకు అమెరికా పత్రిక మద్దతు

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న పాకిస్తానీయులు అభ్యర్థనకు  ఒక ప్రముఖ పాశ్చత్య పత్రిక మద్దతు  లభించింది.

అమెరికా నుంచి ప్రచురితమయ్యే పత్రిక ‘ది క్రిష్టియన్ సైన్స్ మానిటర్’ ఇమ్రాన్ ఖాన్ పేరును వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహమతికి అర్హులయిన వారిలో ఒకరిగా ప్రతిపాదించింది. 

నోబెల్ శాంతి బహుమతికి పరిశీలించే పేర్లలో కచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ పేరు ఉంటుందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇటీవల భారత్ పైలట్ అభినందన్ వర్తమాన్ ను  పాకిస్తాన్ చెర నుంచి విడుదల చేయడం శాంతి కాంక్షించే నాయకత్వం తీసుకున్న చాలా ఆశ్చర్యకరమయిన విషయమని, ఇలాంటివి ఇపుడు సంక్షోభ కాలంలో చాలా అవసరమని ది క్రిష్టియన్ సైన్స్ మానిటర్ పేర్కంది.

భారత్ పైలట్ ను విడుదల చేయడంతో ఫిబ్రవరి 14 న కాశ్బీర్ లోని  పుల్వామాలో  సిఆర్ పిఎఫ్ కాన్వాయ్ మీద  టెర్రర్ దాడి జరిపి 40 మంది హతమార్చిన అనంతరం  భారత్ పాకిస్తాన్ ల మధ్య పేట్రేగిన ఉద్రిక్తత ఒక్క సారి చల్ల బడిందని  ఈ పత్రిక వ్యాఖ్యానించింది.

వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కి పోటీలో ఉండే వారి పేర్లను ఈ పత్రిక A starting list for the Peace Prize అనే శీర్షికతో   ఈ అవార్డు అందుకునేందుకు అర్హత సంపాదించిన నలుగు నేతల మీద సంపాదకీయం ప్రచురించింది.

ఆందులో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ మొదట పేర్కొంది. 2017లో అధికారంలోకి వచ్చిన మూన్ ఉత్తర కొరియాతో ఉన్న వైరాన్ని స్నేహం గా మార్చుకునేందుకు సరిహద్దు గేట్లు తెరిచి చర్చలకు ఉత్తర కొరియా అధ్యక్షుడిని ఆహ్వానించారని ఇది గొప్ప శాంతికాముక నిర్ణయమని ఈ పత్రిక ఎడిటోరియల్ రాసింది.

తర్వాత ఇధియ్ పియా నూతన ప్రధాని అబియ్ అహ్మద్ ను శాంతి బహుమతి అర్హుడిగా ఈ పత్రిక పేర్కొంది. లవ్ అల్వేస్ విన్స్ (Love always wins) అంటూ ఆయన రాజకీయ ఖైదీలందరిని విడుదల చేసి, ఎరిట్రియాతో శాంతి చర్చలకు నాందిపలికారు. దేశగతిని మార్చేందుకు సహకరించాలని ఆయన దేశంలోని తన శత్రువులందరికి పిలుపునిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా 80 జాతుల మధ్య రగులుతున్న విద్వేషాన్ని చల్లబర్చడం ఆయన ముందున్న అతి పెద్ద సవాల్ అని అసమ్మతిని అణచేసేందుకు ఇక ముందు సైన్యాన్ని వాడే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. బలమయిన సైన్యంతో అశాంతి ప్రబలుతందని ఆయన చేసిన వ్యాఖ్యకు సర్వత్రా ప్రశంసలందాయి.

క్రిష్టియన్ సైన్స్ మానిటర్ శాంతి బహుమతి అర్హుల జబితాకెక్కిన మరొక పేరు వెనిజులు తాత్కాలిక అధ్యక్షుడు యువాన్ గువాయిడో ది. నియంతగా పేరున్న నికొలాస్ మాదురోని గద్దె దించేందుకు శాంతియుత పద్ధతులను అవలంభించాలని చెప్పి , ఆ మార్గంలో పయనించి అందరి మన్ననలను పొందారు. చివరకు మిలటరీ కూడా ఆయన వైపే వచ్చింది. ఇది ప్రపంచంలో అపూర్వమని చెబుతారు.