అభిమానుల్ని నిర్మాణ సంస్థపైకి ఉసిగొల్పతున్న హీరోలు.?

‘పుష్ప ది రూల్’ అప్‌డేట్ ఎప్పుడు ఇస్తారురా.? అంటూ అల్లు అర్జున్ అభిమానులు తీవ్రస్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మీద విరుచుకుపడుతున్నారు. చాలాకాలంగా నడుస్తున్న తంతు ఇది. అల్లు అర్జున్ తన అభిమానుల్ని ఈ విషయంలో కంట్రోల్ చెయ్యలేకపోతున్నాడా.?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులైతే ఏకంగా ప్రత్యేక సమావేశం పెట్టి మరీ, మైత్రీ మూవీ మేకర్స్‌కి అల్టిమేటం జారీ చేశారు.. సినిమా ప్రమోషన్లు సరిగ్గా లేవనీ, ‘వాల్తేరు వీరయ్య’ని తొక్కేస్తున్నారనీ ఆరోపిస్తూ. మంచి థియేటర్లు కూడా ఆ సినిమాకి కేటాయించట్లేదన్నది అభిమానుల ఆవేదన.

నందమూరి అభిమానులు కూడా ‘బాస్ పార్టీ’ సాంగ్ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి వస్తే, మైత్రీ బ్యానర్ మీద మండిపడుతూ, ‘వీర సింహా రెడ్డి’లోని ‘జై బాలయ్య’ సాంగ్ తేలిపోవడంపై తిట్ల దండకం అందుకున్నారు.

అభిమానులు చేసే పనులకు అర్థం పర్థం వుండదు. కానీ, హీరోలకు కాస్తంత బాధ్యత వుండాలి కదా.? అభిమానుల్నెందుకు కంట్రోల్చే యడంలేదు.? వాళ్ళే బహుశా నిర్మాతల మీదకి అభిమానుల్ని ఉసిగొల్పుతున్నారేమో అన్న డౌటానుమానాలు సినీ పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయ్.