Private Bus Fire Accident: రాయవరం బస్సు ప్రమాదం అత్యంత విషాదకరం – డాక్టర్ మన్నే రవీంద్ర

Private Bus Fire Accident: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ (APTS) మాజీ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రభుత్వం ఆదుకోవాలి: ఇటువంటి ఘోర ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని డాక్టర్ మన్నే రవీంద్ర కోరారు. రహదారి భద్రతా నియమాలను పాటించడంలో మరియు పర్యవేక్షించడంలో అధికారులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

రెచ్చగొట్టడమే మాధవీ లత పని! | Senior Political Analyst Bharadwaj About Madhavi Latha | Telugu Rajyam