Dr. Manne Ravindra: పట్టణంలోని వేగినాటి కాలనీలో అరబోలు నాగరాజు – ప్రభావతి దంపతుల కుమార్తె ఛి. జ్యోతి పుష్పావతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.
ముఖ్య అతిథులు: ఈ శుభకార్యానికి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు, డాక్టర్ సందీప్, పెద్దారవీడు తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెన్న వెంకటరెడ్డి, ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు షేక్ జిలాని మరియు వడ్లమూడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పోతిరెడ్డి రమణారెడ్డి, గౌరీశంకర్ హోటల్ అధినేత ఎర్రగుంట్ల శ్రీను మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలో పాల్గొని బాలికను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు భారీగా పాల్గొనడంతో వేగినాటి కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

