AP 10th Results: ఏపీ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్: ఫలితాల విడుదల తేది!

AP 10th Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏపీ విద్యాశాఖ రేపు, అంటే ఏప్రిల్ 30 (గురువారం) నాడు అధికారికంగా ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ రోజు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, రేపు ఏపీ ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా విడుదల, గత ఏడాది అనుసరించిన సంప్రదాయం ప్రకారమే, ఈసారి కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.

మొత్తం విద్యార్థులు: 6,40,916

బాలురు: 3,28,652

బాలికలు: 3,12,264

మార్చిలో ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిశాయి. అనంతరం 23 జిల్లాల్లో చేపట్టిన మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 15 నాటికే అధికారులు పూర్తి చేశారు.

మార్కుల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యాంకన సమయంలో మార్కులను మాన్యువల్‌గా నమోదు చేయడంతో పాటు ట్యాబ్‌లలోనూ అప్‌లోడ్ చేశారు. దీనివల్ల కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక పనులు వేగంగా పూర్తయి, ఫలితాలు త్వరగా సిద్ధమయ్యాయి.

ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?
విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ సిద్ధంగా ఉంచుకుని ఈ క్రింది మార్గాల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

సందర్శించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. వాట్సాప్ (మన మిత్ర) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా సులభంగా ఫలితాలు పొందవచ్చు. మొబైల్‌లో 95523 00009 నంబర్‌కు మీ హాల్ టికెట్ నెంబర్ మెసేజ్ చేస్తే వెంటనే ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.

Thota Trimurthulu Reveals What Exactly Happened In 2019 Elections | Telugu Rajyam